చెరువులో చేపల మృత్యువాత
ABN , First Publish Date - 2022-07-03T06:01:33+05:30 IST
చెరువులో చేపల మృత్యువాత
కడ్తాల్, జూలై 2: కాండ్లకుంట చెరువులో శనివారం సుమారు 5వేల చేపలు మృత్యువాతపడ్డాయి. పశువుల కాపరులు గమనించి స్థానిక సర్పంచుకు సమాచారం అందించారు. దీంతో సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు. పోలీసులు, మత్స్యశాఖ ఏడీ సూకీర్తి, అధికారులకు సమాచారం అందించారు. చేపల మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఏదైనా విషయ ప్రయోగం జరిగితే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కోరారు.