గుర్తుతెలియని వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2022-07-04T05:46:07+05:30 IST

గుర్తుతెలియని వృద్ధుడి మృతి

గుర్తుతెలియని వృద్ధుడి మృతి

చేవెళ్ల, జూలై 3: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వృద్ధుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. సుమారు 50సంవత్సరాల వయస్సు గల వృద్ధుడు గతనెల 30న చేవెళ్ల బస్టాండ్‌ ఆవరణలో పడిపోయి ఉండగా పోలీసులు వెంటనే అతన్ని అంబులెన్స్‌లో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పట్టి నుంచి ఈనెల 3వ తేదీ వరకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

Updated Date - 2022-07-04T05:46:07+05:30 IST