బైక్‌ నుంచి కిందపడిన యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-08-09T07:32:13+05:30 IST

బైక్‌ నుంచి కిందపడిన ఓ యువకుడు మృతి చెందాడు.

బైక్‌ నుంచి కిందపడిన యువకుడి మృతి
శివప్రసాద్‌ (ఫైల్‌ఫొటో)

తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 8: బైక్‌ నుంచి కిందపడిన ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి తిరుపతిలో జరిగింది. ఈస్ట్‌ ఎస్‌ఐ జయస్వాములు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా సోమలకు చెందిన శివప్రసాద్‌ (25), ఆయన అన్న సుధాకర్‌ కపిలతీర్థం వైపునుంచి శ్రీనివాస సేతు మీదుగా బస్టాండు వైపు బైక్‌ బయల్దేరారు. శ్రీనివాసం వద్ద బ్రిడ్జి దిగుతుండగా బైక్‌ నడుపుతున్న శివప్రసాద్‌ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయాడు. దాంతో ఇద్దరూ కిందపడ్డారు. ఎటువంటి గాయాలు కానప్పటికీ శివప్రసాద్‌ అక్కడికక్కడే మృతిచెందినట్టు ఎస్‌ఐ తెలిపారు. కాగా.. అన్నదమ్ములిద్దరూ మద్యం తాగి ఉన్నట్టు సమాచారం. ఈస్ట్‌ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-08-09T07:32:13+05:30 IST