గల్లంతైన యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-08-08T05:47:33+05:30 IST

సముద్రంలో గల్లంతైన యువకుడి మృతదేహం ఆదివారం పూసపాటిరేగ మండలం చింతపల్లి తీరానికి కొట్టుకొచ్చింది.

గల్లంతైన యువకుడి మృతి

భోగాపురం: సముద్రంలో గల్లంతైన యువకుడి మృతదేహం ఆదివారం పూసపాటిరేగ మండలం చింతపల్లి తీరానికి కొట్టుకొచ్చింది. ఎస్‌ఐ యు.మహేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా భీమిలి మండలానికి చెందిన ఎర్రి పల్లి ధనరాజు(18) శనివారం ముక్కాం గ్రామస్థులతో కలిసి సముద్రంపైకి వేటకు వెళ్లాడు. పడవ బోల్తా పడడంతో సముద్రంలో గల్లంతయ్యాడు. పూసపాటిరేగ మండలం చింతపల్లి తీరంలో ఆదివారం మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎస్‌ఐ యు.మహేష్‌ తెలిపారు.

Updated Date - 2022-08-08T05:47:33+05:30 IST