జ్ఞానానంద ఆశ్రమంలో ఆగని గోవుల మృత్యు ఘోష
ABN , First Publish Date - 2021-12-20T22:12:22+05:30 IST
జ్ఞానానంద ఆశ్రమంలో గోవుల మృత్యు ఘోష ఆగడం లేదు. ఈ రోజు మరో ఆవు మృతిచెందింది.
విశాఖ: జ్ఞానానంద ఆశ్రమంలో గోవుల మృత్యు ఘోష ఆగడం లేదు. ఈ రోజు మరో ఆవు మృతిచెందింది. ఇప్పటివరకు మొత్తం 26 గోవులు మృతిచెందాయి. రాత్రిళ్లు తీవ్ర చలి కారణంగా గోవులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నాయి. కాగా ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆవులు చనిపోతున్నాయని హిందూ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైసీపీ నేతలు ఆశ్రమ భూములను కబ్జా చేయాలని చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.