మహిళ అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2022-08-13T06:19:53+05:30 IST

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. పంజాగుట్ట పోలీ్‌సలు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్‌ భగత్‌ సింగ్‌ నగర్‌ బొడ్రాయిగల్లికి చెందిన కనుకుంట్ల లక్ష్మి(45)

మహిళ అనుమానాస్పద మృతి

పంజాగుట్ట, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. పంజాగుట్ట పోలీ్‌సలు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్‌ భగత్‌ సింగ్‌ నగర్‌ బొడ్రాయిగల్లికి చెందిన కనుకుంట్ల లక్ష్మి(45) జీహెచ్‌ఎంసీ లో కాంట్రాక్ట్‌ లేబర్‌గా పనిచేస్తుంది. ఆమె ఎల్లారెడ్డిగూడలో విధులు నిర్వహిస్తుంది. 10 రోజుల క్రితం ఎల్లారెడ్డిగూడలో ఆమె గదిని అద్దెకు తీసుకుని ఉంటుంది. ఆమెకు కల్లు తాగే అలవాటు ఉంది. ఆమె సమీప బంధువు కె.లక్ష్మీనరసమ్మ కూడా జీహెచ్‌ఎంసీలో కార్మికురాలిగా పనిచేస్తూ పక్కనే ఉంటుంది. శుక్రవారం ఎల్లారెడ్డిగూడలోని గది ముందు లక్ష్మి అపస్మారక స్థితిలో కింద పడిపోయి కనిపించింది. గమనించిన లక్ష్మీనరసమ్మ  వెంటనే లక్ష్మి కుమారుడు శ్రీకాంత్‌కు సమాచారం ఇచ్చింది. అతను వచ్చి చూడగా అప్పటికే లక్ష్మి మృతిచెందింది. కుమారుడు పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మిని గాయపర్చి ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకునిపోయారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Updated Date - 2022-08-13T06:19:53+05:30 IST