క్రేన్‌పై నుంచి పడి కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2020-12-01T04:04:32+05:30 IST

క్రేన్‌పై నుంచి పడి కార్మికుడి మృతి

క్రేన్‌పై నుంచి పడి కార్మికుడి మృతి

నందిగామ: నందిగామ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని వీర్లపల్లి గ్రామ శివారులోని ఓ స్టీల్‌ పరిశ్రమలో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన బాబులాల్‌ పటేల్‌ (42) గత కొన్నేళ్లుగా మహాలక్ష్మీ స్టీల్‌ పరిశ్రమలో ఎలక్ర్టీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇందులో భాగంగా  ఆదివారం రాత్రి క్రేన్‌పైకి ఎక్కి పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు 20 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలై పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. బాబులాల్‌పటేల్‌ కుమారుడు అర్జున్‌పటేల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్పాప్తు చేస్తున్నటు ఎస్‌ఐ ధనుంజయ తెలిపారు. పరిశ్రమలో కార్మికులకు ఎలాంటి రక్షణ పరికరాలు లేకపోవడంతోనే తీవ్రంగా గాయపడుతున్నారని తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2020-12-01T04:04:32+05:30 IST