ఉరేసుకుని వలస కార్మికుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-11-30T05:26:12+05:30 IST
ఉరేసుకుని వలస కార్మికుడి ఆత్మహత్య
శంషాబాద్ : ఉరేసుకుని వలస కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన భుపేందర్ కుమార్ (29) తన కుటుంబంతో కలసి ఇటీవల వలసవచ్చి శంషాబాద్ అంగడిబజార్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని నివాసముంటున్నాడు. సాతంరాయి శివారులోని ఓ కంపెనీలో కూలీగా పని చేస్తున్నాడు. కాగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.