డీలర్లు రెన్యువల్ చేయించుకోవాలి
ABN , First Publish Date - 2022-05-20T04:54:30+05:30 IST
చౌక దుకాణం డీలర్లు అథరైజేషన్ రెన్యువల్ చేయించుకోవాలని రైల్వేకోడూరు తహసీల్దార్ రామమోహన్ తెలిపారు.
రైల్వేకోడూరు, మే 19: చౌక దుకాణం డీలర్లు అథరైజేషన్ రెన్యువల్ చేయించుకోవాలని రైల్వేకోడూరు తహసీల్దార్ రామమోహన్ తెలిపారు. గురువారం తహసీల్దార్ సభాభవనంలో డీలర్ల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ప్రతి డీలరు బాధ్యతగా బియ్యం ప్రతి వీధికీ వెళ్లే వ్యాన్కు ఇవ్వాలన్నారు. సివిల్ సప్లయ్స్ గురించి చర్చించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అమరేశ్వరి, ఎన్ఫోర్స్మెంట్ డీటీ ప్రసాద్, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.