బధిరుల టీ-20 క్రికెట్‌ విజేత అనంతపురం జట్టు

ABN , First Publish Date - 2022-08-08T05:55:16+05:30 IST

స్థానిక డిగ్రీ కళాశాల ఆవరణలోని ఎన్‌టీఆర్‌ క్రీడా మైదానంలో రెండు రోజుల పాటు జరిగిన రాయలసీమ జోన్‌-4 టీ-20 క్రికెట్‌ పోటీల్లో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది.

బధిరుల టీ-20 క్రికెట్‌ విజేత అనంతపురం జట్టు
గెలుపొందిన క్రికెట్‌ జట్టుతో మంత్రి రోజా

నగరి, ఆగస్టు 7: స్థానిక డిగ్రీ కళాశాల ఆవరణలోని ఎన్‌టీఆర్‌ క్రీడా మైదానంలో రెండు రోజుల పాటు జరిగిన రాయలసీమ జోన్‌-4 టీ-20 క్రికెట్‌ పోటీల్లో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. ద్వితీయ స్థానంలో చిత్తూరు, కర్నూలు తృతీయ, కడప 4వ స్థానంలో నిలిచాయి. విజేతలకు మంత్రి ఆర్‌కే రోజా మెమెంటోలు, కప్పులను అందజేశారు. ఆమె మాట్లాడుతూ బధిరులైనా క్రీడల్లో ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరచిన 16 మంది క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలో విజయవాడలో జరిగే పోటీలకు పంపుతామని తెలిపారు. రోజా చారిటబుల్‌ ట్రస్టు తరఫున వారికి క్రికెట్‌ కిట్లు, దుస్తులు అందిస్తామని, విజయవాడకు వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.


Updated Date - 2022-08-08T05:55:16+05:30 IST