బధిరుల టీ-20 క్రికెట్ విజేత అనంతపురం జట్టు
ABN , First Publish Date - 2022-08-08T05:55:16+05:30 IST
స్థానిక డిగ్రీ కళాశాల ఆవరణలోని ఎన్టీఆర్ క్రీడా మైదానంలో రెండు రోజుల పాటు జరిగిన రాయలసీమ జోన్-4 టీ-20 క్రికెట్ పోటీల్లో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది.
నగరి, ఆగస్టు 7: స్థానిక డిగ్రీ కళాశాల ఆవరణలోని ఎన్టీఆర్ క్రీడా మైదానంలో రెండు రోజుల పాటు జరిగిన రాయలసీమ జోన్-4 టీ-20 క్రికెట్ పోటీల్లో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. ద్వితీయ స్థానంలో చిత్తూరు, కర్నూలు తృతీయ, కడప 4వ స్థానంలో నిలిచాయి. విజేతలకు మంత్రి ఆర్కే రోజా మెమెంటోలు, కప్పులను అందజేశారు. ఆమె మాట్లాడుతూ బధిరులైనా క్రీడల్లో ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరచిన 16 మంది క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలో విజయవాడలో జరిగే పోటీలకు పంపుతామని తెలిపారు. రోజా చారిటబుల్ ట్రస్టు తరఫున వారికి క్రికెట్ కిట్లు, దుస్తులు అందిస్తామని, విజయవాడకు వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.