ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ గడువు
ABN , First Publish Date - 2021-11-26T21:08:12+05:30 IST
ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. తెలంగాణలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్: ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. తెలంగాణలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 12 స్థానాల్లో 6 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో 6 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రంగారెడ్డిలో 2 స్థానాలు, వరంగల్లో ఒక స్థానం.. నిజామాబాద్లో ఒక స్థానం, మహబూబ్నగర్లో 2 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్లో 2 స్థానాలు, మెదక్, నల్గొండ జిల్లాల్లో ఒక్కో స్థానానికి డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 14న కౌంటింగ్ చేస్తారు.