చెరువులో మృతదేహం.. వీఆర్వో ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-07-12T01:05:19+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని తాళ్ళపూడి మండలం పెద్దేవం గ్రామం చాకలి చెరువులో గుర్తుతెలియని

చెరువులో మృతదేహం.. వీఆర్వో ఫిర్యాదు

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని తాళ్ళపూడి మండలం పెద్దేవం గ్రామం చాకలి చెరువులో గుర్తుతెలియని 50 ఏళ్ళ వ్యక్తి మృతదేహo లభ్యమైంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న వీఆర్వో, పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తాళ్లపూడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎవరైనా చంపేసి చెరువులో పడేశారా..? లేకుంటే ఇంకేమైనా జరిగిందా..? అసలు ఆ వ్యక్తి ఎవరు..? ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని ఆరా తీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-07-12T01:05:19+05:30 IST