వ్యక్తి మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2020-11-28T05:46:51+05:30 IST
మండలంలోని యంచ గోదావరిలో శుక్రవారం సాయంత్రం వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఎస్ఐ యాకూబ్ తెలిపారు.
నవీపేట్, నవంబరు 27: మండలంలోని యంచ గోదావరిలో శుక్రవారం సాయంత్రం వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఎస్ఐ యాకూబ్ తెలిపారు. సంబంధిత వ్యక్తికి సుమారు 34 సంవత్సరాల వయసుంటుందని, ఈతడు మృతిచెంది మూడు రోజులైవుంటుందని భావిస్తున్నామన్నారు. ఈతని జేబులో పప్పుల లవన్కుమార్ అనే పేరుతో పాన్కార్డు, ఒక ఏటీఎం లభించిందన్నారు.