గోదావరిలో వృద్ధుడి మృతదేహం

ABN , First Publish Date - 2021-06-24T04:53:26+05:30 IST

గోష్పాద క్షేత్రం వద్ద గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహా న్ని పట్టణ పోలీసులు గుర్తించారు.

గోదావరిలో వృద్ధుడి మృతదేహం
వృద్ధుడి మృతదేహం

కొవ్వూరు, జూన్‌ 23: గోష్పాద క్షేత్రం వద్ద గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహా న్ని పట్టణ పోలీసులు గుర్తించారు. గీతాశ్రమం ఎదురుగా వృద్ధుడి మృతదేహం తేలుతుందని సమాచారం రావడంతో పట్టణ ఎస్‌ఐ కె.వెంకటరమణ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో  మృతదేహాన్ని నది నుంచి వెలికితీయించారు. మృతుడి వివరాలు తెలియరాలేదన్నారు. అతని వయస్సు సమారు 60 ఏళ్లు ఉంటుందన్నారు. వీఆర్వో చెల్లె జగ్జీవన్‌రావు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటరమణ తెలిపారు.

Updated Date - 2021-06-24T04:53:26+05:30 IST