గార్గేయ నదిలో వృద్ధుడి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-10-25T06:23:16+05:30 IST

సదుం గార్గేయ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వృద్ధుడు గంగయ్య (101) మృతేహాన్ని పోలీసులు ఆదివారం ఉదయం గుర్తించారు.

గార్గేయ నదిలో వృద్ధుడి మృతదేహం లభ్యం
గంగయ్య మృతదేహం

సదుం, అక్టోబరు 24: సదుం గార్గేయ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వృద్ధుడు గంగయ్య (101) మృతేహాన్ని పోలీసులు ఆదివారం ఉదయం గుర్తించారు. సదుం వాల్మీకి వీధికి చెందిన గంగయ్య శనివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎస్‌ఐ ధరణీధర్‌ ఆధ్వర్యంలో పోలీసులు, పీలేరు అగ్నిమాపక సిబ్బంది, కుటుంబసభ్యులు గంగయ్య కోసం గాలించారు. స్థానిక మఠం మిట్ట సమీపంలోని కాజ్‌వే వద్ద మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2021-10-25T06:23:16+05:30 IST