బోటు ప్రమాదంలో..మహిళ మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2020-02-20T09:16:22+05:30 IST
బోటు ప్రమా దంలో గల్లంతైన మహిళ మృతదేహం లభ్య మైంది. సీలేరు నదిలో మంగళవారం సాయంత్రం
డొంకరాయి, ఫిబ్రవరి 19: బోటు ప్రమా దంలో గల్లంతైన మహిళ మృతదేహం లభ్య మైంది. సీలేరు నదిలో మంగళవారం సాయంత్రం నాటుపడవ బోల్తా పడి ఇద్దరు గల్లంతు కాగా ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. బుధవారం జరిపిన గాలింపు చర్యల్లో భాగంగా సాయంత్రానికి గల్లంతైన పాంగి తుల (30) మృతదేహం లభ్యమైందని చింతూరు సీఐ యువకుమార్ తెలిపారు. పాంగి సంజు మృత దేహం కోసం రెవెన్యూ, ఫైర్ సిబ్బందితోపాటు సీఆర్పీఎఫ్ పోలీసులు, స్థానిక జాలర్ల సహా యంతో నదిలో మోటార్ బోటుతో గాలిస్తున్నట్టు చెప్పారు. వెలుతురు సరిగా లేని కారణంగా రాత్రి సమయాల్లో గాలింపునకు అవరోధం ఏర్పడిందని సీఐ తెలిపారు.
విషాదంలో తుల కుటుంబం
బోటు ప్రమాదంలో మృతిచెందిన తులను చూసి ఆమె భర్త నర్సింగ్, నలుగురు పిల్లలు బోరున విలపిం చారు. చిన్న పిల్లలైన నలుగురిని తనకు వదిలిపెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా అంటూ భర్త కన్నీరుమున్నీరయ్యాడు.