ఇంట్లో పెద్ద శబ్దం.. ఉలిక్కిపడి నిద్రలేచిన బాలుడు.. భయంతో గదిలోకి వెళ్తే కనిపించిన తండ్రి శవం.. ఏడుస్తూ తల్లి గదిలోకి వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2022-06-06T14:47:26+05:30 IST

యూపీలోని మధురలో గల ఒక ఇంటిలో...

ఇంట్లో పెద్ద శబ్దం.. ఉలిక్కిపడి నిద్రలేచిన బాలుడు.. భయంతో గదిలోకి వెళ్తే కనిపించిన తండ్రి శవం.. ఏడుస్తూ తల్లి గదిలోకి వెళ్లి చూస్తే..

యూపీలోని మధురలో గల ఒక ఇంటిలో రక్తపు మడుగులో పడి ఉన్న దంపతుల మృతదేహాలు కనిపించాయి. ఇద్దరి మృతదేహాలు వేర్వేరు గదుల్లో పడి ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఉదంతం గోవింద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లోని జగన్నాథపురి కాలనీలో చోటుచేసుకుంది. కృష్ణ కుమార్ కౌశిక్ అలియాస్ నిమాయ్ పండిట్ తన భార్య సాధన కౌశిక్, కుమారునితో పాటు జగన్నాథపురిలో ఉంటున్నారు.




వారి పిల్లలు వేర్వేరు గదుల్లో నిద్రిస్తున్నారు. ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దం విని కుమారుడు లేచాడు. ఒక గదిలో తండ్రి మృతదేహం, మరో గదిలో తల్లి మృతదేహం పడి ఉండటాన్ని చూశాడు. స్థానికులు పోలీసులకు ఈ సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లైసెన్స్‌డ్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నితాయ్ పండిట్ మొదట తన భార్యను పిస్టల్‌తో కాల్చి తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. 

Updated Date - 2022-06-06T14:47:26+05:30 IST