కృష్ణపట్నంలో ‘డీ సల్ఫరైజేషన్‌’ టెక్నాలజీ

ABN , First Publish Date - 2021-04-19T09:32:08+05:30 IST

కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో సల్ఫర్‌ ఉద్గారాలను తగ్గించే టెక్నాలజీని ఏర్పాటు చేయాలని ఏపీ జెన్‌కో నిర్ణయించింది.

కృష్ణపట్నంలో ‘డీ సల్ఫరైజేషన్‌’ టెక్నాలజీ

అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో సల్ఫర్‌ ఉద్గారాలను తగ్గించే టెక్నాలజీని ఏర్పాటు చేయాలని ఏపీ జెన్‌కో నిర్ణయించింది. బొగ్గు ఆధారంగా విద్యుత్‌ ఉత్పత్తి చేసే కేంద్రాల్లో కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్న కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ సూచించిన నమూనా ప్రకారం ఫ్లూ గ్యాస్‌లోని సల్ఫర్‌ ఉద్గారాలను తగ్గించడానికి ఈ విధానాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విధానం అమలుకు రూ.900 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీనికి సంబంధించిన టెండర్‌ పత్రాలను న్యాయ పరిశీలనకు పంపారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 26 వరకు న్యాయ పరిశీలన కమిషన్‌ వెబ్‌సైట్‌కు పంపవచ్చని విద్యుత్‌ శాఖ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2021-04-19T09:32:08+05:30 IST