ఈ నెల 31 వరకు సోషల్ గేదరింగ్స్పై నిషేధం
ABN , First Publish Date - 2021-12-16T22:55:49+05:30 IST
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నిరోధక ఆంక్షలను ఈ
న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నిరోధక ఆంక్షలను ఈ నెల 31 రాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డీడీఎంఏ) ప్రకటించింది. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధం విధించినట్లు తెలిపింది. బార్లు, రెస్టారెంట్లు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మాత్రమే పని చేయాలని తెలిపింది. దీని ప్రభావం క్రిస్టమస్, నూతన సంవత్సరం వేడుకలపై పడుతుంది.
డీడీఎంఏ జారీ చేసిన ఆదేశాల ప్రకారం, ప్రస్తుతం ఢిల్లీలో డిసెంబరు 31-జనవరి 1 మధ్య రాత్రి వరకు ఆంక్షలు కొనసాగుతాయి. కోవిడ్-19 పరిస్థితి మెరుగుపడుతుండటంతో చాలా కార్యకలాపాలకు అనుమతి ఇచ్చినప్పటికీ, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన, అటువంటి ఇతర కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతుంది.
డీడీఎంఏ నిర్ణయంపై రెస్టారెంట్లు, బార్ల యజమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారి వల్ల వచ్చిన నష్టాల నుంచి బయటపడతామని తాము ఎంతో ఆశించామని, ఈ ఆంక్షలు తమను ఆవేదనకు గురి చేస్తున్నాయని చెప్పారు.