హేమంత్ను ఎలా చంపారో చెప్పిన డీసీపీ
ABN , First Publish Date - 2020-09-25T17:59:45+05:30 IST
నగరంలో మరో పరువు హత్య జరిగింది. హేమంత్, అవంతి ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు.
హైదరాబాద్: నగరంలో మరో పరువు హత్య జరిగింది. హేమంత్, అవంతి ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే అవంతి ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు హేమంత్ను దారుణంగా హత మార్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వెల్లడించారు. నాలుగు నేలల క్రితం హేమంత్, అవంతిక ప్రేమ పేళ్లి చేసుకుని, గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీ నివాసం ఉంటున్నారని తెలిపారు.
నిన్న మాట్లాడాలంటూ అవంతిక కుంటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని హేమంత్ నివాసానికి వచ్చారని డీసీపీ చెప్పారు. వారిని కారులో తీసుకువెళుతుండగా అనుమానం రావడంతో తప్పించుకునేందుకు అవంతిక, హేమంత్ ప్రయత్నించారని, కారులో నుంచి దూకిన అవంతిక అత్తమామలకు ఫోన్ చేసిందన్నారు. అవంతిక మేనమామ మరికొందరు కలిసి హేమంత్ను మరో కారులో తీసుకొని వెళ్లారని హేమంత్ తల్లిదండ్రులు చందానగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వేంటనే అప్రమత్తమయ్యామన్నారు. గోపన్ పల్లిలో తోమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అర్ధరాత్రి అవంతిక మేనమామ యుగంధర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా హేమంత్ను సంగారెడ్డిలో హత్య చేసి పడేసిన్నట్లు ఓప్పుకున్నాడని తెలిపారు. మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరొకరు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.