మరో ఇద్దరు వికాస్ దూబే గ్యాంగ్ సభ్యుల అరెస్ట్

ABN , First Publish Date - 2020-07-11T14:22:03+05:30 IST

కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్ అయిన రెండోరోజే అతని ముఠాకు చెందిన మరో ఇద్దరు సభ్యులను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.....

మరో ఇద్దరు వికాస్ దూబే గ్యాంగ్ సభ్యుల అరెస్ట్

గ్వాలియర్ (మధ్యప్రదేశ్): కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్ అయిన రెండోరోజే అతని ముఠాకు చెందిన మరో ఇద్దరు సభ్యులను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. బిక్రూ గ్రామంలో 8 మంది పోలీసులను హతమార్చిన కేసులో నిందితులైన దూబే గ్యాంగ్ సభ్యులు ఇద్దరు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో దాక్కోగా యూపీ పోలీసులు శనివారం వారిని అరెస్టు చేశారు. దూబే గ్యాంగ్ సభ్యులైన ఓం ప్రకాష్ పాండే, అనిల్ పాండేలను గ్వాలియర్ లోని రహస్య స్థావరంలో అరెస్టు చేశామని కాన్పూర్ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ జెఎన్ సింగ్ చెప్పారు. వీరిద్దరు గ్యాంగ్ సభ్యులు మరో రహస్య స్థావరానికి మకాం మార్చేందుకు యత్నిస్తుండగా అరెస్టు చేశామని సింగ్ పేర్కొన్నారు. పోలీసుల చంపిన వారిలో దూబే ముఠాకు చెందిన 21 మంది సభ్యుల ఆచూకీ చెబితే ఒక్కొక్కరికి 50వేల రివార్డు ఇస్తామని సర్కారు ప్రకటించింది. 

Updated Date - 2020-07-11T14:22:03+05:30 IST