కాలువలో పడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-09-27T07:04:24+05:30 IST
కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల సూరంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రామానికి చెందిన....
దౌల్తాబాద్ సెప్టెంబరు: కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల సూరంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రామానికి చెందిన తాటి సంగయ్య (35) వర్షాలు ఎక్కువ పడడంతో శనివారం కాలువలో చేపలు పడదామని వెళ్లాడు. ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య దుర్గ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.