కోడలిపై మామ అత్యాచార యత్నం.. ఆమె ప్రతిఘటించడంతో ఎంత దారుణానికి పాల్పడ్డాడంటే..

ABN , First Publish Date - 2022-03-08T17:17:14+05:30 IST

తన కొడుకును వివాహం చేసుకుని ఇంట్లో అడుగు పెట్టిన కోడలిపై కన్నేశాడు.. అదును చూసి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు.

కోడలిపై మామ అత్యాచార యత్నం.. ఆమె ప్రతిఘటించడంతో ఎంత దారుణానికి పాల్పడ్డాడంటే..

తన కొడుకును వివాహం చేసుకుని ఇంట్లో అడుగు పెట్టిన కోడలిపై కన్నేశాడు.. అదును చూసి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమె కొడుకును, తన మనవడిని చంపేందుకు ప్రయత్నించాడు. అతడికి భార్య కూడా సహకరించడం విషాదకరం. వారి బారి నుంచి తప్పించుకున్న మహిళ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 


రాజస్థాన్‌లోని జైపూర్‌కు సమీపంలోని ఆదర్శ నగర్‌కు చెందిన బాధిత మహిళకి నాలుగేళ్ల క్రితం మనీష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. వ్యాపార రీత్యా మనీష్ పలు రాష్ట్రాలు తిరుగుతుంటాడు. కాగా, ఇటీవల కొంత కాలంగా బాధిత మహిళకి అత్తింటి వారితో విభేదాలు తలెత్తాయి. అత్త, మామలతో గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆమెపై మామగారు అత్యాచార యత్నం చేశాడు. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ప్రైవేట్ భాగాలను తాకేందుకు ప్రయత్నించాడు. 


ఆమె అతడిని తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మామగారు పక్కనే ఉన్న రెండున్నరేళ్ల బాలుడిపై తన ప్రతాపం చూపించాడు. అతడి గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. అతడికి అతని భార్య కూడా సహకరించింది. వారిద్దరి నుంచి తప్పించుకున్న బాధిత మహిళ కొడుకుతో కలిసి సోమవారం మధ్యాహ్నం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.  

Updated Date - 2022-03-08T17:17:14+05:30 IST