అలాంటి స్థితిలో తండ్రి కంటపడిన కుమార్తె.. ఆగ్రహంతో ఆయన అందరిముందూ తన ప్యాంటు బెల్టు తీసి..

ABN , First Publish Date - 2021-10-14T14:47:50+05:30 IST

చాలామంది యువతీయువకులు..

అలాంటి స్థితిలో తండ్రి కంటపడిన కుమార్తె.. ఆగ్రహంతో ఆయన అందరిముందూ తన ప్యాంటు బెల్టు తీసి..

చాలామంది యువతీయువకులు తమ తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వ్యవహారాలు నడుపుతుంటారు. అయితే ఇలాంటివారు ఎప్పుడైనా వారి తల్లిదండ్రుల కంటపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మధ్యప్రదేశ్ లోని హర్దా జిల్లాలో బహిరంగంగా.. ప్రేమికుల జంటను బెల్టుతో కొట్టిన ఉదంతం వెలుగు చూసింది. ఆ యువతి తండ్రే వారిని చావబాదాడు. నిర్మానుష్య ప్రదేశంలో తన కుమార్తె మరో యువకునితో కనిపించింది. వెంటనే ఆయన తన ప్యాంటుకున్న బెల్టు తీసి వారిద్దరిపై దాడి చేశాడు. తన కుమార్తె ఆ యువకునితో తిరుగుతూ తప్పుడుగా నడుచుకుంటున్నదని ఆయన భావించాడు. అందుకే ఆగ్రహం పట్టలేక వారిని చావబాదాడు. ఈ సందర్భంగా అక్కడున్నవారు ఈ ఘటనను వీడియోలో బంధించారు. అంతేకానీ వారెవరూ ఆ యువతీ యువకులను కాపాడేందుకు మందుకురాలేదు.




దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ యువతి తండ్రితో పాటు అతనికి సహకరించిన మరోవ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఘటన అక్టోబరు 11న మధ్యాహ్నం హర్దా పరిధిలోని ఖెరీనీమా రోడ్డు వద్ద జరిగింది. ఆ మర్నాడు బాధిత యువకుడు తనపై దాడిచేసిన ఆ యువతి తండ్రి రామ్‌సేవక్, ఖిడికీవాలపై టిమరిన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనను చంపేస్తామని కూడా బెదిరించారని ఆ యువకుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చార్ఖెడ్ నివాసి యశ్వంత్ 24 ఏళ్ల యువతితో బైక్ మీద తిరుగుతున్నాడు. ఖెడీనీమా రోడ్డు దగ్గరకు రాగానే యువతి తండ్రి వారిని గమనించాడు. దీంతో వారిద్దరిపై అనుమానం కలిగిన ఆయన వారిపై దాడి చేశారు. అయితే వైరల్ అయిన వీడియోలో ఆ యువతి... అతను తన స్నేహితుడని, సోదరునిలాంటివాడని చెబుతోంది. అయినప్పటికీ ఆమె తండ్రి ఆమె మాట పట్టించుకోకుండా కొడుతూనే ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-14T14:47:50+05:30 IST