తండ్రి మందలించడంతో కుమార్తె ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-21T07:32:44+05:30 IST

పొలం పనులకు రావడంలేదని తండ్రి మందలిం చడంతో మనస్తాపం చెందిన కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం..

తండ్రి మందలించడంతో కుమార్తె ఆత్మహత్య
ప్రత్యూష మృతదేహం

బొమ్మలరామారం, మే 20: పొలం పనులకు రావడంలేదని తండ్రి మందలిం చడంతో మనస్తాపం చెందిన కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. మండ లంలోని  చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన గుండెబోయిన నర్సింహకు ముగ్గురు    కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె ప్రత్యూష(18) ఇంట్లోనే ఉంటుంది. నర్సింహకు తనకు ఉన్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమిని సాగు  చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.  పొలానికి వచ్చి వ్యవసాయం పనులు చేయాలని కుమార్తెను కోరాడు. ఆ మాటలు పటించుకోనందున కుమార్తెను మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన కుమార్తె  ప్రత్యూష శుక్రవారం  ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తండ్రి పొలం నుంచి ఇంటి వచ్చి సరికి ఆమె మృతి చెంది ఉంది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  




Updated Date - 2022-05-21T07:32:44+05:30 IST