Viral Video: తనను తానే పెళ్లాడిన యువతి గుర్తుందా..? ఆ వీడియోను తల్లిదండ్రులకు చూపించిందో యువతి.. ఆమె తల్లి కామెంట్స్ వింటే..

ABN , First Publish Date - 2022-06-26T00:02:50+05:30 IST

గుజరాత్‌కు చెందిన క్షమా బిందు అనే యువతి కొన్ని రోజుల క్రితం తనను తానే వివాహం చేసుకుంది.

Viral Video: తనను తానే పెళ్లాడిన యువతి గుర్తుందా..? ఆ వీడియోను తల్లిదండ్రులకు చూపించిందో యువతి.. ఆమె తల్లి కామెంట్స్ వింటే..

గుజరాత్‌కు చెందిన క్షమా బిందు అనే యువతి కొన్ని రోజుల క్రితం తనను తానే వివాహం చేసుకుంది. తన మెడలో తానే తాళి కట్టుకుని, తాను ఒక్కతే హనీమూన్‌కు వెళ్లింది. దేశంలో ఇదే తొలి `సోలోగమీ` వివాహం. ఈ వివాహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో అయితే ఈ వివాహంపై చాలా మంది స్పందిస్తున్నారు. 


తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో వైష్ణవి అనే యువతి ఈ వివాహంపై స్పందించాల్సిందిగా తన తల్లిదండ్రులను కోరింది. ముందుగా తండ్రిని అడిగింది. అతను అందులో చెప్పడానికేం లేదని అన్నాడు. అయితే ఆమె తల్లి మాత్రం అద్భుతమైన రియాక్షన్ ఇచ్చింది. `ఆమె చాలా సంతోషంగా ఉంటుంద`ని పేర్కొంది. తల్లి రియాక్షన్ విని ఆ యువతి బిగ్గరగా నవ్వింది. ఆ వీడియోను వైష్ణవి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. `మా అమ్మ రియాక్షన్ చూడండి` అని కామెంట్ చేసింది. ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంది. 

Updated Date - 2022-06-26T00:02:50+05:30 IST