ఛీ..ఛీ.. వీడసలు తండ్రేనా? ఇద్దరు కూతుళ్లపై దశాబ్దాలుగా అత్యాచారం.. చివరకు..

ABN , First Publish Date - 2022-04-07T21:08:31+05:30 IST

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి తన కూతుళ్ల పైనే దారుణానికి ఒడిగట్టాడు.

ఛీ..ఛీ.. వీడసలు తండ్రేనా? ఇద్దరు కూతుళ్లపై దశాబ్దాలుగా అత్యాచారం.. చివరకు..

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి తన కూతుళ్ల పైనే దారుణానికి ఒడిగట్టాడు. చిన్న పిల్లలని కూడా చూడకండా వారితో తన కామవాంఛ తీర్చుకున్నాడు. కన్న కూతుళ్లను లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఎన్నో సంవత్సరాల నుంచి అతను తన పెద్ద కూతురిపై అత్యాచారం చేస్తున్నాడు. ఆమె పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన తర్వాత చిన్న కూతురిపై కన్నేశాడు. ఎట్టకేలకు వారిద్దరూ తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. 


జోధ్‌పూర్‌లోని ఓ కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లను లైంగికంగా వేధించాడు. పెద్ద కూతురికి ఆరు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తొలిసారి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. 1993లో తండ్రి తనపై అత్యాచారం చేశాడని, ఆ విషయాన్ని తల్లికి చెప్పినా ఆమె పట్టించుకోలేని బాధిత మహిళ చెప్పింది. ఆ తర్వాత కూడా తనపై తండ్రి ఎన్నోసార్లు అత్యాచారం చేశాడని పేర్కొంది. ఆమెకు 2017లో వివాహం కావడంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. 


ఆ తర్వాత ఆ కామాంధుడి కన్ను చిన్న కూతురిపై పడింది. ఆమెను కూడా అతడు లైంగికంగా వేధించాడు. దీంతో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కలిసి పోలీసులను ఆశ్రయించారు. తమ తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-04-07T21:08:31+05:30 IST