నయీమ్ కేసులో దర్యాప్తు ఏమైంది? : శ్రవణ్ దాసోజు

ABN , First Publish Date - 2021-08-08T23:39:09+05:30 IST

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ జరిగి ఐదేళ్లు పూర్తవుతున్నా.. నేటికీ పూర్తి స్థాయి దర్యాప్తు ఎందుకు జరగలేదని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు ప్రశ్నించారు.

నయీమ్ కేసులో దర్యాప్తు ఏమైంది? : శ్రవణ్ దాసోజు

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ జరిగి ఐదేళ్లు పూర్తవుతున్నా.. నేటికీ పూర్తి స్థాయి దర్యాప్తు ఎందుకు జరగలేదని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు ప్రశ్నించారు. ఆదివారం ఆయన  మీడియాతో మాట్లాడుతూ నయీమ్ బ్లూ డైరీ, స్వాధీనం చేస్తున్న వేల ఎకరాల భూములు, వేల కోట్ల రూపాయలు, సిట్ దర్యాప్తు చేసిన వివరాలను ప్రభుత్వం ఎందుకు ప్రజల ముందు పెట్టలేదన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఆరోపణలు ఉన్నా.. కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. చిన్న స్థాయి పోలీసు అధికారులపై చర్యలు మినహా చేసిందేమీ లేదన్నారు. ఐదేళ్లవుతున్నా పూర్తి స్థాయి చార్జిషీట్లు నమోదు చేయలేదని ఆరోపించారు. నయీమ్ బాధితుల్లో ప్రభుత్వం.. ఎంతమందికి న్యాయం చేసిందో చెప్పాలన్నారు. సీబీఐ ఎంక్వయిరీ వేయాలన్న.. ప్రతిపక్షాల డిమాండ్లను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు గతంలో గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో అంటకాగినందుకే.. కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. సిట్‌ రిపోర్ట్, నయీమ్ బ్లూ డైరీని బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Updated Date - 2021-08-08T23:39:09+05:30 IST