ఢిల్లీ: దాసోజు శ్రవణ్ (Dasoju Shravan) బీజేపీలో చేరబోతున్నారని బీజేపీ తెలంగాణ ఇన్చార్జ్ తరుణ్చుగ్ (Tarun chugh) తెలిపారు. తరుణ్ చుగ్ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, దాసోజు శ్రవణ్ కలిశారు. చేరికల తేదీ త్వరలోనే ఖరారు చేస్తామని తరుణ్చుగ్ ప్రకటించారు. టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోతోందని, తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం దోచుకుంటోందని మండిపడ్డారు. కాంగ్రెస్ కేసీఆర్కు బీటీమ్గా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. రానున్న రోజుల్లో బీజేపీలో మరిన్ని చేరికలుంటాయని తరుణ్చుగ్ తెలిపారు.
డబ్బు, కాంట్రాక్టులిచ్చి చేర్చుకునే సంస్కృతి బీజేపీది కాదని సంజయ్ (Sanjay) తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన రాజ్గోపాల్, దాసోజు ఎందుకు పార్టీ మారుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ నేత సోనియాను తిట్టినవారే ఇప్పుడు పీసీసీ చీఫ్ అయ్యారని, కేసీఆర్ భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని సంజయ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి