సరస్వతి అలంకరణలో అమ్మవారి దర్శనం
ABN , First Publish Date - 2022-10-03T05:55:08+05:30 IST
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజకవ ర్గాల్లోని ఆలయా ల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. చాలా ఆలయాల్లో ఏడో రోజు ఆదివారం సరస్వతీదేవిగా అలంకరించి కొలువుదీర్చారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్వర్క్)
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజకవ ర్గాల్లోని ఆలయా ల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. చాలా ఆలయాల్లో ఏడో రోజు ఆదివారం సరస్వతీదేవిగా అలంకరించి కొలువుదీర్చారు. ధర్మవరం పట్టణంలోని పలు ఆలయాల్లో అమ్మవార్లను టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ టీడీపీ నాయకులతో కలిసి దర్శించుకుని పూజలు నిర్వహిం చారు. అలాగే మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ, ఆయన సతీమణి నిర్మలాదేవి ఆయా దేవాలయాల్లో అమ్మవార్లకు పట్టువసా్త్రలు సమర్పించి, పూజలు చేయించారు.