చీకటి బడ్జెట్: బుచ్చయ్య చౌదరి

ABN , First Publish Date - 2022-03-11T20:40:52+05:30 IST

వైసీపీ ప్రభుత్వం చీకటి బడ్జెట్ ప్రవేశపెట్టిందని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.

చీకటి బడ్జెట్: బుచ్చయ్య చౌదరి

అమరావతి: వైసీపీ ప్రభుత్వం చీకటి బడ్జెట్ ప్రవేశపెట్టిందని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అకౌంటబిలిటీ లేకుండా చేసుకునే గోబెల్స్ ప్రచారం ఆర్ధిక ఉగ్రవాదమేనని తప్పుబట్టారు. పన్నుల రూపేణా ఆదాయం పెంచుకుని కూడా సంక్షేమానికి ఖర్చు చేయకపోవడంతో రాష్ట్రం చిన్నాభిన్నమవుతోందని విమర్శించారు. గత బడ్జెట్ లో దోచిందెంత, దాచిదెoతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ కేటాయింపులకు ఖర్చులకు ఎక్కడా పొంతన లేదని విమర్శించారు. లక్షల కోట్లు అప్పు తెచ్చి, సంక్షేమాన్ని విస్మరిస్తూ తెచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాగితాల ప్రకటనలకే బడ్జెట్ పరిమితమవుతోంది తప్ప ఎక్కడా రాజ్యాంగ బద్ధంగా లేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి దుయ్యబట్టారు.

Updated Date - 2022-03-11T20:40:52+05:30 IST