ఇది పీక్స్.. బెయిల్పై విడుదలయ్యాక రెచ్చిపోయిన దొంగ! పోలీసులకే ఝలక్!
ABN , First Publish Date - 2020-10-20T18:38:58+05:30 IST
ట్రక్ దొంగిలించిన నేరంలో బెయిల్పై విడుదలైన ఓ దొంగ మరుసటి రోజే రెచ్చిపోయాడు. పోలీస్ స్టేషన్ ముందు పార్క్ చేసున్న అదే ట్రక్ను మళ్లీ దొంగిలించి పోలీసులకు ఊహించని ఝలకిచ్చాడు.
నాగ్పూర్: ట్రక్ దొంగిలించిన నేరంలో బెయిల్పై విడుదలైన ఓ దొంగ ఆ మరుసటి రోజే రెచ్చిపోయాడు. పోలీస్ స్టేషన్ ముందు పార్క్ చేసున్న అదే ట్రక్ను మళ్లీ దొంగిలించి పోలీసులకు ఊహించని ఝలకిచ్చాడు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో సోమవారం ఉదయం ఈ ఉదంతం జరిగింది. సంజయ్ ధోనే అనే వ్యక్తిని అక్కడి పోలీసులు కొద్దీ రోజుల క్రితం ట్రక్ దొంగిలించాడనే నేరంపై అరెస్టు చేశారు. అతడు ఇటీవలే బెయిల్పై విడుదలయ్యాడు.
అయితే..సంజయ్ దొంగిలించిన ట్రక్ మాత్రం పోలీస్ స్టేషన్కు సమీపంల్లోనే పార్క్ చేసి ఉంది. రికార్డుల్లో ట్రక్ వివరాలు నమోదు చేసేందుకు అధికారులు అక్కడ పార్క్ చేశారు. అయితే..బెయిల్పై విడుదలైన మరుసటి రోజే సంజయ్ రెచ్చిపోయాడు. వాహనం వద్ద కాపాలాగా ఉన్న ఓ వ్యక్తిని చితక్కొట్టేసి..ట్రక్తో సహా అక్కడి నుంచి ఉడాయించాడు. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా..సంజయ్కి పెద్ద చరిత్రే ఉందని, అతడిపై ఇప్పటికే ట్రక్ దొంగతనాలకు సంబంధించి 20కి పైగా కేసులు ఉన్నాయని స్థానిక పోలీసులు తెలిపారు.