ప్రమాదకరంగా బోటు ప్రయాణం

ABN , First Publish Date - 2021-01-25T03:17:47+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలోనే పర్యాటక ప్రాంతంగా ఉన్న సోమశిల ప్రాంతంలో ఆహ్లాదం, ఆధ్మాత్మికతతో పాటు ప్రమాదం కూడా పొంచి ఉంది. రాష్ట్ర నలమూలల నుంచి శని, ఆదివారాల్లో పర్యాటకులు పెద్ద ఎత్తున సోమశిల కృష్ణానదిని తిలకించేందుకు తరలివస్తున్నారు.

ప్రమాదకరంగా బోటు ప్రయాణం
కృష్ణానదిలో లైఫ్‌ జాకెట్స్‌ లేకుండా మరబోటు ప్రయాణం చేస్తున్న పర్యాటకులు

కొల్లాపూర్‌, జనవరి 24: తెలంగాణ రాష్ట్రంలోనే పర్యాటక ప్రాంతంగా ఉన్న సోమశిల ప్రాంతంలో ఆహ్లాదం, ఆధ్మాత్మికతతో పాటు ప్రమాదం కూడా పొంచి ఉంది. రాష్ట్ర నలమూలల నుంచి శని, ఆదివారాల్లో పర్యాటకులు పెద్ద ఎత్తున సోమశిల కృష్ణానదిని తిలకించేందుకు తరలివస్తున్నారు. చుట్టూ ఉన్న నల్లమల ప్రకృతి అందాలను తిలకిస్తూ పురాతనమైన ఆలయాల్లో దర్శనం చేసుకుం టూ పర్యాటకులు, భక్తులు కృష్ణానదిలో మరబోటు ప్రయాణం చేస్తున్నారు. బోటు యజమానులు లైఫ్‌ జాకెట్స్‌ ఇవ్వకుండా పరిమితికి మించి జనంతో కృష్ణానదిలో బోటు ప్రయాణం సాగిస్తున్నారు.  సప్తనదుల సంగమం సంగమేశ్వర ఆలయాన్ని సందర్శించేందుకు ఉమ్మడి జిల్లా వాసులు జలమార్గం లో సోమశిల నుంచి సంగమేశ్వరానికి చేరుకుంటున్నారు. వీరికి బోటు నిర్వాహకులు లైఫ్‌ జాకెట్స్‌ అందుబాటులో ఉంచకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. 

Updated Date - 2021-01-25T03:17:47+05:30 IST