ప్రమాదపుటంచున ఫొటోలకు ఫోజుల్చిన మోడల్.. నెట్టింట వైరల్!
ABN , First Publish Date - 2021-01-25T03:12:23+05:30 IST
నలుగురిలో తమకు గుర్తింపు ఉండాలని.. పాపులర్ అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మోడల్లకు సహజంగానే ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. అందరూ కాకపోయినా కొందరు మాత్రం.. పాపులారిటీ కో
వాషింగ్టన్: నలుగురిలో తమకు గుర్తింపు ఉండాలని.. పాపులర్ అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మోడల్లకు సహజంగానే ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. అందరూ కాకపోయినా కొందరు మాత్రం.. పాపులారిటీ కోసం ఎంత రిస్క్ అయినా చేయడానికి సిద్ధపడుతుంటారు. ఈ కోవకే చెందిన యూఎస్ మోడల్.. ప్రమాదపుటంచున ఫోటోలకు ఫోజులిచ్చి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, నలుగురూ తన గురించి మాట్లాడుకునేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పెన్సిల్వేనియాకు చెందిన 25ఏళ్ల అమైరీస్ రోస్ అనే మోడల్.. గత డిసెంబర్లో హాలిడే ట్రిప్ కోసం జాంబియాకు వెళ్లింది.
అక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విక్టోరియా జలపాతాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా డెవిల్స్ పూల్గా ప్రసిద్ధిగాంచిన జలపాతం అంచున.. 1640 అడుగుల ఎత్తులో ఫొటోలకు ఫోజులిచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోను తన ఇన్స్ట్రాగ్రామ్ ద్వారా నెటిజన్లతో పంచుకుంది. అంతేకాకుండా ‘అంచుల్లో జీవితం.. ఇక్కడ చాలా బాగుంది’ అనే క్యాప్షన్ కూడా వాటికి తగిలించింది. కాగా.. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వాటిని చూసి స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. కొందరు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరేమో.. ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ కామెంట్ చేస్తున్నారు.