పాలకుల అనాలోచిత నిర్ణయాలతో ప్రమాదం

ABN , First Publish Date - 2021-12-09T06:09:56+05:30 IST

పాలకుల అనాలోచిత నిర్ణయాల వలన దేశానికి తీవ్ర ప్రమాదమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వైటీ దాసు అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 300వ రోజు కొనసాగాయి.

పాలకుల అనాలోచిత  నిర్ణయాలతో ప్రమాదం
దీక్షా శిబిరంలో నిరసన తెలుపుతున్న నిర్వాసితులు

కూర్మన్నపాలెం, డిసెంబరు 8: పాలకుల అనాలోచిత నిర్ణయాల వలన దేశానికి తీవ్ర ప్రమాదమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వైటీ దాసు అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 300వ రోజు కొనసాగాయి. బుధవారం ఈ దీక్షలలో సింటర్‌ప్లాంట్‌ విభాగం ఉద్యోగులు కూర్చున్నారు. ఈ శిబిరంలో దాసు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నేడు కార్మిక వర్గం ఐక్యంగా పోరాడుతున్నదని, ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఎంఎస్‌వీ ఉమామహేశ్వరరావు, కేవీ సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, పట్టా రమేశ్‌, రామారావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-09T06:09:56+05:30 IST