మహారాష్ట్ర సరిహద్దుల్లో డేంజర్ బెల్స్

ABN , First Publish Date - 2021-04-14T20:20:46+05:30 IST

కరోనా తీవ్రత పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దుల్లో కఠినచర్యలు తీసుకుంటోంది. మహారాష్ట్రతో

మహారాష్ట్ర సరిహద్దుల్లో డేంజర్ బెల్స్

నిజామాబాద్: కరోనా తీవ్రత పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దుల్లో కఠినచర్యలు తీసుకుంటోంది. మహారాష్ట్రతో సరిహద్దు కలిగిన ప్రాంతాల్లో కరోనా కేసులతో ప్రమాదకర సూచనలు కనబడుతున్నాయి. సలాబత్ పూర్, సాలూరా, కందకుర్తి అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద మహారాష్ట్ర నుంచి రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి ప్రత్యేకంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోజుకు 20కి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ వచ్చిన వారిని  వైద్య సిబ్బంది వెనక్కి పంపేస్తున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం మరాఠా రోగులు క్యూ కడుతున్నారు. దీంతో సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పూర్తిగా పరిశీలించాకే తెలంగాణలోకి రావడానికి అనుమతి ఇస్తున్నారు. 



Updated Date - 2021-04-14T20:20:46+05:30 IST