రేవంత్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు: దానం నాగేందర్

ABN , First Publish Date - 2022-05-24T19:03:14+05:30 IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ విమర్శించారు. అభివృద్ధి రేవంత్‌కు కనిపించడం లేదా?

రేవంత్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు: దానం నాగేందర్

హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ విమర్శించారు. అభివృద్ధి రేవంత్‌కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రేవంత్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. రెడ్డిల చేతిలో అధికారం ఉండాలన్న రేవంత్ వ్యాఖ్యలపై భట్టి, వీహెచ్ ఇతర నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రేవంత్ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దానం నాగేందర్ పేర్కొన్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్ బోర్డ్ పెట్టాలని ఆనాడే తాము కోరామన్నారు. హైదరాబాద్‌కు సుంకిషాల నీళ్లు తేవాలంటే పట్టించు కోలేదన్నారు. ఇప్పుడు రేవంత్ వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. పార్థ సారథి రెడ్డి మార్కెట్ రేట్ ప్రకారమే రెమిడెసివర్ ఇచ్చారన్నారు. ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని.. అలాంటి వ్యక్తి మీద జగ్గారెడ్డి బురద జల్లడం సరికాదని దానం నాగేందర్ హితవు పలికారు.

Updated Date - 2022-05-24T19:03:14+05:30 IST