TS News: తెలంగాణలో కాపులకు ప్రత్యకమైన స్థానం ఉంది: దానం నాగేందర్

ABN , First Publish Date - 2022-07-31T18:45:49+05:30 IST

హైదరాబాద్: నగరంలోని మియాపూర్‌లో ఆదివారం కాపుల ఆత్మగౌరవ సభ జరిగింది.

TS News: తెలంగాణలో కాపులకు ప్రత్యకమైన స్థానం ఉంది: దానం నాగేందర్

హైదరాబాద్ (Hyderabad): నగరంలోని మియాపూర్‌లో ఆదివారం కాపుల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ కార్యక్రామానికి రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా కాపులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ (Telangana)లో కాపులకు ప్రత్యకమైన స్థానం ఉందన్నారు. కాపుల కోసం నగరంలో ఐదు ఎకరాల స్థలం కేటాయిస్తామని సీఎం కేసీఆర్ (CM KCR) చెప్పారని తెలిపారు. త్వరలోనే జీవో (GO) విడుదల చేస్తారన్నారు. కాపుల అన్నీ డిమాండ్లు నెరవేరుస్తామని సీఎం హామీ ఇచ్చారని, త్వరలోనే లక్ష మందితో బహిరంగ సభ పెట్టి వివరాలు ముఖ్యమంత్రే స్వయంగా వెల్లడిస్తారని దానం నాగేందర్ పేర్కొన్నారు.

Updated Date - 2022-07-31T18:45:49+05:30 IST