స్వాతంత్ర్య వీరులకు నివాళిగా దాల్మియా భారత్ గ్రూప్ ఆన్‌లైన్‌ కాన్సెర్ట్

ABN , First Publish Date - 2020-08-11T01:40:11+05:30 IST

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దాల్మియా భారత్ గ్రూప్ ఆన్‌లైన్‌‌లో సంగీత కచేరీ నిర్వహించనుంది. ఆగస్టు 14వ తేదీ...

స్వాతంత్ర్య వీరులకు నివాళిగా దాల్మియా భారత్ గ్రూప్ ఆన్‌లైన్‌ కాన్సెర్ట్

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దాల్మియా భారత్ గ్రూప్ ఆన్‌లైన్‌‌లో సంగీత కచేరీ నిర్వహించనుంది. ఆగస్టు 14వ తేదీ సాయంత్రం 6.15 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమర వీరులకు నివాళులర్పించేందుకు 'జజ్బా-ఈ-భారత్' శీర్షికన ఈ సంగీత కచేరీని నిర్వహించబోతున్నారు. అంతేకాకుండా కోవిడ్-19 పోరాటంలో దాల్మియా గ్రూప్ స్ఫూర్తి, విలువలు, లక్ష్యాలను ఈ కార్యక్రమం ద్వారా  ప్రదర్శించనున్నారు. సుప్రసిద్ధ గాయకులు కైలాష్ ఖేర్, రిక్కీ కేజ్‌లు ఈ ఆన్‌లైన్ సంగీత కచేరీలో తమ మధురమైన గాత్రంతో ఆలపించనున్నారు. ఈ సంగీత కచేరీని ఆస్వాదించేందుకు https://www.dblconcert.com/ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా సూచించింది.

Updated Date - 2020-08-11T01:40:11+05:30 IST