Dalits Angry With Trs Mla: తిరగబడ్డ జనం.. ఎమ్మెల్యే రాజయ్యను తీసుకెళ్లిన పోలీసులు

ABN , First Publish Date - 2022-09-29T02:57:50+05:30 IST

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై దళితులు తిరగబడ్డారు. దళితబంధు పథకం ఎంపికలో అన్యాయం చేస్తున్నారంటూ..

Dalits Angry With Trs Mla: తిరగబడ్డ జనం.. ఎమ్మెల్యే రాజయ్యను తీసుకెళ్లిన పోలీసులు

జనగామ: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై దళితులు తిరగబడ్డారు. దళితబంధు పథకం ఎంపికలో అన్యాయం చేస్తున్నారంటూ ప్రశ్నించడంతో కార్యకర్తలు, దళితులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 


జనగామ జిల్లా ఓబులాపూర్‌లో ఆసరా పెన్షన్ కార్డులు, బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే రాజయ్య ప్రసంగిస్తుండగా తాము దళితబంధుకు అర్హత ఉన్నప్పటికీ తమను ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. అక్కడే ఉన్న కార్యకర్తలు, దళితులకు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. 


ఎంతకూ పరిస్థితి చక్కపడకపోవడంతో ఎమ్మెల్యే రాజయ్యను అక్కడ నుంచి పోలీసులు తీసుకెళ్లారు. దళితబంధు జాబితాలో పేరు ఇవ్వాలంటే డబ్బు ఇవ్వాలని అలా ఇచ్చిన వారికే ఇస్తున్నాంటూ ప్రజలు మండిపడుతున్నారు. 





Updated Date - 2022-09-29T02:57:50+05:30 IST