దళితబంధు ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలి
ABN , First Publish Date - 2022-05-24T04:47:05+05:30 IST
దళితబంధు పథకాన్ని ప్రతీ దళిత కుటుంబానికి వర్తింపజేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి డి.బాల్రెడ్డి డిమాండ్ చేశారు.
వీపనగండ్ల, మే 23 : దళితబంధు పథకాన్ని ప్రతీ దళిత కుటుంబానికి వర్తింపజేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి డి.బాల్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కేవీపీఎస్, డీవైఎఫ్ఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యం లో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ దరణి వచ్చిన తరువాత భూ సమస్యలు పెరిగిపోయాయని, సమస్యలను వెంటనే పరిష్క రించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్, పింఛన్, రేషన్కార్డులు ఇవ్వా లన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్య క్షుడు మురళీ, సంగినేనిపల్లి సర్పంచు మౌలాలి, వివిధ ప్రజా సంఘాల నాయకులు రామచం ద్రయ్యగౌడ్, బాల వెంకటేశ్వర్లు, శేఖర్రెడ్డి, ఆశన్న, నాగనరాజు, ఈశ్వర్, నాగేష్, వెంకటేస్, నవీన్, వెంకటయ్య పాల్గొన్నారు.