విధి విధానాలు లేని ఏకైక పథకం దళితబంధు: ప్రవీణ్‌కుమార్‌

ABN , First Publish Date - 2022-03-19T01:33:53+05:30 IST

విధి విధానాలు లేని ఏకైక పథకం దళితబంధు అని బీఎస్పీ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు.

విధి విధానాలు లేని ఏకైక పథకం దళితబంధు: ప్రవీణ్‌కుమార్‌

తిరుమలగిరి: విధి విధానాలు లేని ఏకైక పథకం దళితబంధు అని బీఎస్పీ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. దళితులను మభ్యపెట్టడానికే ఈ పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టి డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. బీఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలు బాగుండాలంటే నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందజేయాలన్నారు. రైతుబంధు భూస్వామ్య బంధుగా మారిందన్నారు. రైతుబంధు ద్వారా వచ్చే రూ.5వేలు చిన్న, సన్నకారు రైతులకు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. రెండోసారి అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామన్న సీఎం కేసీఆర్‌ ఆ మాట మరిచిపోయారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. 

Updated Date - 2022-03-19T01:33:53+05:30 IST