‘దళితబంధు’ పేదలకు వరం
ABN , First Publish Date - 2021-10-21T06:04:55+05:30 IST
దళితబంధు పథకం పేదలకు వరమని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సంకేపల్లి రఘునందన్రెడ్డి అన్నారు.
తిరుమలగిరి, అక్టోబరు 20 : దళితబంధు పథకం పేదలకు వరమని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సంకేపల్లి రఘునందన్రెడ్డి అన్నారు. దళితబంధు పథకం పైలెట్ ప్రాజెక్టులో భాగంగా తిరుమలగిరి మండలానికి రూ.50 కోట్లు ప్రకటించినందుకు బుధవారం మునిసిపాలిటీ కేంద్రంలో సీఎం కేసీఆర్, మంత్రి జగదీ్షరెడ్డి, ఎమ్మెల్యే కిషోర్కుమార్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్, తెలంగాణ తల్లి విగ్రహలకు పూలమాలలు వేసి ఘనంగా నివాలర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ స్నేహలత, మార్కెట్ కమిటీ చైర్మన్ మూల అశోక్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ చంద్రశేఖర్, కౌన్సిలర్లు సరిత, అనసూయ, ప్రియలత, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు యాదగిరి, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు.