ఉప ఎన్నిక కోసమే ‘దళితబంధు’: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-07-26T07:16:23+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక దృష్ట్యా సీఎం కేసీఆర్‌ దళిత బంధు లాంటి పథకాలను ప్రవేశపెడుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

ఉప ఎన్నిక కోసమే  ‘దళితబంధు’: ఎమ్మెల్యే
చౌటుప్పల్‌లోని చిన్నారి శైని కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

చౌటుప్పల్‌, జూలై25: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక దృష్ట్యా సీఎం కేసీఆర్‌  దళిత బంధు లాంటి పథకాలను ప్రవేశపెడుతున్నారని  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ పుణ్యమేనని ఆయన ఆన్నారు. చౌటుప్పల్‌ మండల కేంద్రంలో  ఆదివారం సాయంత్రం పర్యటించారు. ముంపు ప్రమాదం ఉన్న చౌటుప్పల్‌ చెరువును పరిశీలించారు. చెరువు నీటి కోసం తీసిన కాలువను పరిశీలించారు. వరద నీటితో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు.  అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులతో మండల కేంద్రంలో   తొర్పునూరి ఉమారాణి  ఇద్దరి పిల్లలతో ఆత్మహత్య చేసుకోగా, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు ఉమారాణి  కుటుంబానికి రూ.2లక్షల ఆర్థికసాయం అందిస్తానని ప్రకటించారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ ఉప్పు భద్రయ్య, నాయకలు ఉబ్బు వెంకటయ్య, కొయ్యడ సైదులు, మొగుదాల రమేష్‌, ఆకుల ఇంద్రసేనారెడ్డి, కాసర్ల శ్రీనివా్‌సరెడ్డి, శ్రీనాథ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-07-26T07:16:23+05:30 IST