వైసీపీలోని దళిత మేధావులు ఎక్కడున్నారు?: అనిత
ABN , First Publish Date - 2020-09-28T01:51:03+05:30 IST
జడ్జి రామకృష్ణ సోదరుడిపై వైసీపీ నేతల హత్యాయత్నం దుర్మార్గమని వంగలపూడి అనిత అన్నారు. ఆవేదన బయటపెడితే హత్య చేస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీలోని దళిత మేధావులు ఎక్కడున్నారని
అమరావతి: జడ్జి రామకృష్ణ సోదరుడిపై వైసీపీ నేతల హత్యాయత్నం దుర్మార్గమని వంగలపూడి అనిత అన్నారు. ఆవేదన బయటపెడితే హత్య చేస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీలోని దళిత మేధావులు ఎక్కడున్నారని నిలదీశారు. దళిత జడ్జిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవమానించినపుడు ఏం చేశారు? అని ప్రశ్నించారు. వైసీపీ నేతల నీతిమాలిన, నిస్సిగ్గు రాజకీయాలు మితిమీరిపోయాయని అనిత ధ్వజమెత్తారు.