చంద్రబాబుతోనే దళితుల సంక్షేమం

ABN , First Publish Date - 2022-08-19T05:06:33+05:30 IST

చంద్రబాబునా యుడుతోనే దళిత సంక్షేమం సాధ్యమవుతుం దని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు అన్నారు.

చంద్రబాబుతోనే దళితుల సంక్షేమం
మాట్లాడుతున్న పీఎంజే బాబు:


  ‘అంబేడ్కర్‌ విదేశీ విద్య’ను కొనసాగించాలి

  టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు 


అరసవల్లి ఆగస్టు 18: చంద్రబాబునా యుడుతోనే దళిత సంక్షేమం సాధ్యమవుతుం దని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు అన్నారు. గురువారం ఆయన విలేకరు లతో మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమం త్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన అంబేడ్కర్‌ విదేశీ విద్యా పథకాన్ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి, మళ్లీ మూడేళ్ల తరువాత జగనన్న విదేశీ విద్యాపథకం అని పేరు పెట్టడం భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించడమేనన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల ద్వారా దళిత వాడల అభివృద్ధి జరిగింద న్నారు. వేల ఎకరాలను కొనుగోలు చేసి దళితులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు, బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్‌, తదితర 29 పథకాలను దళితుల సంక్షేమం కోసం టీడీపీ అమలు  చేసిందన్నా రు. ఈ పథకాలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి దళితులకు తీరని ద్రోహం చేసిందన్నారు. దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యమైపోయాయన్నారు. దళిత ఓట్లతో గెలిచిన జగన్‌రెడ్డి ఈ ద్రోహానికి తగు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. ఇప్పటికైనా అంబేడ్కర్‌ విదేశీ విద్యా పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.





Updated Date - 2022-08-19T05:06:33+05:30 IST