రాష్ట్రంలో దళితమేధం

ABN , First Publish Date - 2022-05-24T08:23:09+05:30 IST

డాక్టర్‌ సుధాకర్‌ నుంచి నేటి సుబ్రహ్మణ్యం వరకు వందలాది మంది ప్రాణాలను పొట్టునబెట్టుకుని ముఖ్యమంత్రి రాష్ట్రంలో దళితమేధం

రాష్ట్రంలో దళితమేధం

దళితుల ప్రాణాలతో చెలగాటమాడడం ముఖ్యమంత్రికి అలవాటయింది: శ్రావణ్‌కుమార్‌

గుంటూరులో దళిత ప్రతిఘటన ర్యాలీ

అడ్డుకున్న పోలీసులు.. పలువురు అరెస్టు


గుంటూరు (తూర్పు), మే 23: ‘‘డాక్టర్‌ సుధాకర్‌ నుంచి నేటి సుబ్రహ్మణ్యం వరకు వందలాది మంది ప్రాణాలను పొట్టునబెట్టుకుని ముఖ్యమంత్రి రాష్ట్రంలో దళితమేధం సృష్టిస్తున్నారు. దళితుల ప్రాణాలతో చెలగాటమాడటం సీఎంకి అలవాటు అయిపోయింది’’ అని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి తెనాలి శ్రావణ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. దళితులపై వరుస దాడులకు నిరసన గా సోమవారం జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో దళిత ప్రతిఘటన పేరుతో గుంటూరులో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకోవాలని,లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. టీడీపీ నాయకులు చేపట్టిన కాగడాల ప్రదర్శనకు పోలీసులు అడుగడుగునా అడ్డుంకులు సృష్టించారు. టీడీపీ నాయకులను ఎక్కడికక్కడ అరె్‌స్టలు చేశారు. 

Updated Date - 2022-05-24T08:23:09+05:30 IST