దళితులపై జగన్ రెడ్డి దమనకాండ కొనసాగుతోంది: లోకేష్

ABN , First Publish Date - 2020-08-12T03:44:55+05:30 IST

రాష్ట్రంలో దళితులపై జగన్ రెడ్డి దమనకాండ కొనసాగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యూనివర్సిటీల్లో కుల వివక్ష దారుణం అని పేర్కొన్నారు.

దళితులపై జగన్ రెడ్డి దమనకాండ కొనసాగుతోంది: లోకేష్

అమరావతి: రాష్ట్రంలో దళితులపై జగన్ రెడ్డి దమనకాండ కొనసాగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యూనివర్సిటీల్లో కుల వివక్ష దారుణం అని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఆయన ట్వీట్ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు ఆరేటి మహేష్‌పై ఉపకులపతి కక్ష సాధింపు చర్యలకు దిగడం.. జగన్ రెడ్డి దళిత వ్యతిరేక విధానాలకు నిదర్శనం అని అన్నారు. 40 రోజులుగా పిహెచ్‌డి ఫైల్ ఆపి మహేష్‌ని వేధిస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు. ఉన్నత చదువు అభ్యసించి, ఉన్నత స్థానంలో ఉండాల్సిన దళిత బిడ్డ.. నడిరోడ్డుపై యూనివర్సిటీ గేట్ దగ్గర న్యాయం కోసం ఉద్యమం చేస్తున్నాడని, 30 గంటలు దాటినా దీనిపై స్పందించకుండా ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరిస్తోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరేటి మహేష్‌కి తక్షణమే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహేష్‌పై వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని లోకేష్ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-08-12T03:44:55+05:30 IST