ప్రగతి భవన్‌లో ముగిసిన ‘దళిత బంధు’ సదస్సు

ABN , First Publish Date - 2021-07-27T01:41:42+05:30 IST

ప్రగతిభవన్‌లో దళిత బంధు సదస్సు ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సదస్సు కొనసాగింది.

ప్రగతి భవన్‌లో ముగిసిన ‘దళిత బంధు’ సదస్సు

హైదరాబాద్: ప్రగతిభవన్‌లో దళిత బంధు సదస్సు ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సదస్సు కొనసాగింది. ఈ సమావేశంలో హుజురాబాద్ నియోజకవర్గ దళిత ప్రజాప్రతినిధులు, దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దళిత బంధు అమలు, పర్యవేక్షణ, నిర్వహణపై సీఎం కేసీఆర్ దిశ నిర్దేశం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల తీరుతెన్నులను సీఎం వివరించారు. దళిత బంధు తరహాలో దళిత భీమాకు సీఎం గ్రీన్ సిగ్నలిచ్చారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల తరహాలో దళిత బంధు ఉంటుందని కేసీఆర్ తెలిపారు. 


దళిత కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చి వారి జీవనస్థితిగతుల్లో మార్పును తీసుకువచ్చే లక్ష్యంతో ప్రవేశపెడుతున్న దళితబంధు పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1500 కోట్ల రూపాయలు వెచ్చించి నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున యేటా 11,900 కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించారు. ఈ పథకం అమలుకు హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.

Updated Date - 2021-07-27T01:41:42+05:30 IST