యూఏఈలో మ‌ళ్లీ విజృంభిస్తున్న‌ మ‌హ‌మ్మారి !

ABN , First Publish Date - 2020-07-07T16:51:13+05:30 IST

మ‌ధ్య‌లో వారం రోజుల పాటు కాస్తా తగ్గుముఖం ప‌ట్టిన మ‌హమ్మారి క‌రోనా యూఈలో తాజాగా మ‌ళ్లీ విజృంభిస్తోంది.

యూఏఈలో మ‌ళ్లీ  విజృంభిస్తున్న‌ మ‌హ‌మ్మారి !

యూఏఈ: మ‌ధ్య‌లో వారం రోజుల పాటు కాస్తా తగ్గుముఖం ప‌ట్టిన మ‌హమ్మారి క‌రోనా యూఈలో తాజాగా మ‌ళ్లీ విజృంభిస్తోంది. ‌గ‌త కొన్నిరోజులుగా అంత‌కంత‌కు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయ‌ని ప్ర‌భుత్వ అధికార ప్ర‌తినిధి డా. అమ్నా అల్ దహక్ అల్ షంసీ తెలిపారు. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల ప‌ట్ల‌ కొంత‌మంది పౌరులు, ప్ర‌వాసులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం కూడా వైర‌స్ వ్యాప్తికి ఒక కార‌ణ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 


ఇక సోమ‌వారం న‌మోదైన 528 కొత్త కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 52,068 మంది కోవిడ్ బారిన ప‌డ్డారు. అలాగే 424 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న‌వారు 40,721 మంది అయ్యారు. ఇప్ప‌టికే యూఏఈ వ్యాప్తంగా 324 మందిని ఈ మ‌హ‌మ్మారి బ‌లిగొంది. క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ‌కు ముమ్మ‌రంగా కోవిడ్ టెస్టులు చేస్తున్న యూఏఈ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే 30ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. సోమ‌వారం కూడా 28వేల క‌రోనా ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-07-07T16:51:13+05:30 IST